|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 04:02 PM
హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ కమిటీల ఎన్నికలు కార్యకర్తల అభిప్రాయాల ఆధారంగా జరుగుతాయని పార్టీ పరిశీలకులు పాండు రంగప్ప (హిందూపురం), రవి భూషణ్ (లేపాక్షి) గురువారం ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు పార్టీ నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త భావాలను గౌరవించడంతో పాటు, ఆయా కుటుంబాల సాధికారిక సారథుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం అన్ని స్థాయిల్లో సమన్వయం అవసరమని, నూతన కమిటీలు పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేలా ఉండాలన్నారు.
ఇక గ్రామ, మండల కమిటీలలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, యువతకు అవకాశాలు కల్పించడంపైనా దృష్టి సారిస్తున్నామని వారు తెలిపారు. గ్రామస్థాయిలోనే కార్యకర్తల దృక్కోణం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.