|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 04:07 PM
ఎయిరిండియా విమానాల్లో సమస్యలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ-పారిస్ ఎయిరిండియా విమానం సర్వీస్ రద్దు చేశారు. ముందుస్తు తనిఖీల్లో ఏఐ143 విమానంలో సమస్యలు తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రయాణికులకు రీఫండ్ చేస్తామని ఎయిరిండియా పేర్కొంది. మరోవైపు విమానాల్లో సాంకేతిక లోపాల నేపథ్యంలో మంగళవారం డీజీసీఏ కీలక సమావేశం నిర్వహించనుంది. కాగా మంగళవారం ఉదయం అహ్మదాబాద్-లండన్ విమానం సాంకేతిక లోపంతో రద్దయింది.
Latest News