|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 02:42 PM
పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహితుడు ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆదివారం జరగ్గా తాజాగా వెలుగుచూసింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు లెహ్రా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కరంజిత్ సింగ్ సోమవారం తెలిపారు. అలాగే అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
Latest News