![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:47 PM
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా వైయస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు విజయవంతం అయ్యాయని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో వైయస్ఆర్సీపీ నేతృత్వంలో మహిళలు స్వచ్చందంగా ఈ నిరసనల్లో పాల్గొని, ప్రభుత్వ నిర్లక్ష్య పాలనపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని అన్నారు. కూటమి ఏడాది పాలనలో రాష్ట్రలో స్త్రీల మాన, ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన మహిళాగ్రహమే ఒక నిదర్శనమని వెల్లడించారు.
Latest News