తరగతుల్లోకి చొరబడి మరీ విద్యార్థి కాల్పులు
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:47 PM

ఆస్ట్రియాలోని ఓ పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ముఖ్యంగా ఓ బాలుడు తుపాకీతో బడిలోకి వచ్చాడు. ఆపై నేరుగా తరగతి గదుల్లోకి వెళ్లి.. పాాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులు సహా విద్యార్థులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు జరిపిన అనంతరం సదరు బాలుడు సైతం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్లు ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.


ఆస్ట్రియా గ్రాజ్ నగరంలోని ఓ పాఠశాలలో మంగళవారం ఉదయం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ కాల్పులకు పాల్పడింది ఓ విద్యార్థి అని పోలీసు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఆయుధంతో చొరబడిన ఆ విద్యార్థి.. రెండు తరగతుల్లో విచక్షణా రహితంంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30కి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు తెగబడుతున్న ఆ విద్యార్థిని వారించడానికి ప్రయత్నించిన మహిళా ఉపాధ్యాయురాలిపై కూడా బాలుడు పదే పదే కాల్పులు జరిపాడు. దీంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడింది. ఆపై బాలుడు అక్కడి నుంచి పారిపోగా.. విషయం గుర్తించిన యాజమాన్యం వెంటనే పోలీసులు, అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందించారు.


ఇలా హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది క్షతాగాత్రులను ఆస్పత్రులకు తరలించింది. ఆపై మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు పోలీసులు కాల్పులకు తెగబడ్డ విద్యార్థి గురించి బడంతా వెతికారు. ఈక్రమంలోనే ఆ విద్యార్థి మృతదేహం బాత్రూం వద్ద లభ్యం అయింది. అయితే అతడు కాల్పులు చేసిన తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. అతడి మృతదేహం బాత్రూములో పడి ఉన్న తీరు, చేతులో ఉన్న తుపాకీ ఆధారంగానే తాము ఇలా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోసారి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పాఠశాల వద్ద భద్రతా దళాలను మోహరించినట్లు తెలిపారు.


2015 జూన్‌లో గ్రాజ్ ప్రాంతంలో ఇదే తరహాలో కాల్పులు జరిగాయి. నాడు ఆ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అది జరిగి నేటికి సరిగ్గా పది సంవత్సరాలు అవుతోంది. అయితే దానికి గుర్తుగానే ఆ విద్యార్థి కాల్పులకు తెగబడి ఉంటాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Kolkata's image takes hit in international media after chaos at Messi eventKolkata's image takes hit in international media after chaos at Messi event Sun, Dec 14, 2025, 03:52 PM
Messi reaches Mumbai for third pit stop of 'GOAT Tour' Sun, Dec 14, 2025, 03:32 PM
US Congressman calls for deeper India US ties, civic engagement Sun, Dec 14, 2025, 03:24 PM
Sri Lanka to revive tourism after Cyclone Ditwah Sun, Dec 14, 2025, 03:16 PM
No link between COVID-19 vaccines and sudden deaths in young adults: AIIMS Sun, Dec 14, 2025, 03:09 PM