![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:38 PM
రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ను ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు కలిశారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని వారికి వైయస్ జగన్ భరోసానిచ్చారు.
Latest News