![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:36 PM
కూటమి ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లను నిలువునా ముంచింది, వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి అని ఎండియూ యూనియన్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్యామ్బాబు అన్నారు. నేడు జగన్ ని కలిసిన అయన మాట్లాడుతూ... ఎండీయూ ఆపరేటర్లు ఉన్న సమయంలో రైస్ పక్కదోవ పట్టాయన్నారు కానీ ఈ నెలలో రేషన్ షాప్ ల ద్వారా రైస్ పంపిణీ చేస్తున్నా రాష్ట్రంలో అనేక చోట్ల రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మరి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడేం సమాధానం చెబుతారు. మాకు వెహికిల్ లోన్స్ క్లియర్ చేస్తామని అది కూడా కూటమి ప్రభుత్వం చేయలేదు. ప్రజాపంపిణీ వ్యవస్ధను నిర్వీర్యం చేశారు. ప్రజలు రేషన్ షాప్ల వద్ద క్యూలైన్స్లో నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా సర్వర్లు పనిచేయడం లేదని డీలర్లు మళ్ళీ మళ్ళీ తిప్పించుకుంటున్నారు. మేం వైయస్ జగన్ గారిని కలిసి మా సమస్యలు వివరించాం, తప్పకుండా మిమల్ని ఆదుకుంటామని వైయస్ జగన్ గారు భరోసానిచ్చారు. మాకు సంతోషంగా ఉంది` అని శ్యామ్బాబు హర్షం వ్యక్తం చేశారు.
Latest News