![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:34 PM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఏపీ ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) యూనియన్ కృష్ణా జిల్లా ప్రతినిధులు కలిశారు. ప్రజల వద్దకు ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించాలన్న గొప్ప ఉద్దేశంతో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను ఏర్పాటు చేసి 9,260 మంది కుటుంబాలకు ఉపాధి కల్పించి తమను ఆదుకున్నది మీరేనంటూ వైయస్ జగన్కు ఆపరేటర్లు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం తమను అన్యాయం చేసిందని, ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్ధను తొలగించి తమ జీవనోపాధి లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమతో పాటు దాదాపు 10,000 మంది హెల్పర్స్ కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డున పడ్డాయని ఆపరేటర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఎండీయూ ఆపరేటర్లకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైయస్ జగన్ భరోసానిచ్చారు.
Latest News