![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:32 PM
కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన మహిళలంతా బాధపడుతున్నారని, ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం ప్రసాదించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని వేడుకున్నట్లు వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కోరారు. గుడిలో ఉన్న దేవుడిని వదిలిపెట్టి..ఇప్పుడు వేడుకుంటున్నా ఈ ప్రభుత్వం కనికరించడం లేదని కూటమి నేతలకు ఓట్లు వేసిన మహిళలు బాధపడుతున్నారని తెలిపారు. పోలీసులు కూడా మహిళ భధ్రతపై దృష్టి పెట్టేలా మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ను కోరినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వరుదు కళ్యాణి, మేయర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని స్వరాజ్ మైదానంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ..`రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై శాంతియుతంగా నిరసన తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు విజయవాడ స్వరాజ్ మైదానానికి వచ్చాం. ప్రభుత్వం మమ్మల్ని మైదానంలోని అనుమతించకుండా అభ్యంతరాలు సృష్టించారు. విగ్రహం వెనుకవైపు వినతిపత్రాలు ఇవ్వమని పోలీసులు అడ్డుకుంటున్నారు. వినతిపత్రాలు ఎవరికైనా ముందునుంచి కదా ఇచ్చేది. మేం శాంతియుతంగా వినతిపత్రం ఇస్తామంటే ఒప్పుకోవడం లేదు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు విఫరీతంగా పెరిగాయి. ప్రభుత్వం మహిళల భద్రత విషయంలో పూర్తిగా విఫలమైంది. మహిళలు ఇంట్లో ఉన్నా కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. స్కూల్, కాలేజీ, పని ప్రాంతంలో కూడా హత్యాచారాలు జరుగుతున్నాయి. అనంతపురంలో తన్మయి అనే విద్యార్థిని కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కుళ్లి శవమైన బాలికను చూపించారు. ప్రభుత్వం మేల్కోని వెతికిపట్టుకుంటే ఆ అమ్మాయి బాగుండేంది. ఆరు నెలల పాటు శ్రీసత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికను అత్యాచారం చేశారు. మేం ఫిర్యాదు చేసే వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ ఘటనలపై సీఎం, డిప్యూటీసీఎం, హోం మంత్రి స్పందించడం లేదు. ఉండి, భీమిలి ఇలా ప్రతి చోటా ఏదో ఒక ఘటన జరుగుతున్నాయి. గంటకు మూడు నాలుగు అఘయిత్యాలు జరుగుతున్నాయి. హోం మంత్రిగా మహిళా ఉండి కూడా ఆమె స్పందించడం లేదు అని ఆగ్రహం వ్యక్తపరిచారు.
Latest News