మహిళలను వేశ్యలుగా సంభోదించిన వారిని వదిలే ప్రసక్తే లేదు
 

by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:27 PM

మహిళలను వేశ్యలుగా సంభోదించిన వారిని వదిలే ప్రసక్తే లేదు

సజ్జల రామకృష్ణరెడ్డి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కొన్ని వేదమంత్రాలు వల్లించారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు  మండిపడ్డారు. అమరావతిలో మహిళలను వేశ్యలుగా అవమానించిన వ్యక్తుల ఫోటోలను చెప్పుతో కొట్టాలన్నారు. గత ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను తాను ప్రశ్నించినందుకు నర్సాపురం పార్లమెంటులో అన్ని గ్రామాల్లో తన ఫోటోలను చెప్పులతో కొట్టించారని గుర్తుచేశారు. వాళ్ళకు వాళ్ళు రాక్షసులు, పిశాచాలు అనుకుంటే వారి ఇష్టమన్నారు. ‘వాళ్ళంతా పిశాచాలు, రాక్షసులు, సంకర జాతి వాళ్ళు అని నేను పోరపాటున కూడా అనడం లేదు. నా దిష్టి బొమ్మలు తగులబెట్టారు. మూత్రం కూడా పోశారు. చెప్పుకోవాలంటే బాధ అనిపిస్తుంది. ఇవి సోషల్ మీడియాలో పెట్టి చాలా ఆనందించారు. ఇది రాక్షస ఆనందం అంటారో, పిశాచ ఆనందం అంటారో. ఏదో పిల్ల వేషాలు వేశారులే పిల్ల వెధవలు అని క్షమించి వదిలేసా’ అంటూ రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు.

Latest News
Her life, leadership inspire crores: PM Modi extends birthday wishes to Prez Murmu Fri, Jun 20, 2025, 11:03 AM
Chengdu 2025 World Games medal design unveiled Fri, Jun 20, 2025, 10:38 AM
Nitish Reddy can be in playing eleven if he bowls 14-15 overs in an innings, says childhood coach Fri, Jun 20, 2025, 10:35 AM
Mohanlal meets Sri Lankan PM, gets 'gracious welcome' at parliament Fri, Jun 20, 2025, 10:34 AM
PM Modi begins his three-state tour from today Fri, Jun 20, 2025, 10:29 AM