![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:27 PM
తిరుమలలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద 650 టెంకాయలు కొట్టి.. 6.5 కిలోల కర్పూరాన్ని వెలిగించి టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మొక్కులు చెల్లించుకున్నారు. సామాజిక సేవలు చేస్తూ సామాన్య ప్రజలకు బాలకృష్ణ ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. బసవతారకం ట్రస్టు ద్వారా ఎందరికో వైద్య సేవలు అందిస్తున్నారని ఉద్ఘాటించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండటంతో పాటు ప్రజలకు మరింత సేవ చేయాలని స్వామి వారిని ప్రార్ధించి మొక్కులు చెల్లించుకున్నామని శ్రీధర్ వర్మ పేర్కొన్నారు.
Latest News