![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jun 10, 2025, 07:15 PM
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా క్వార్ట్జ్ అక్రమాల కేసులో నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆయన పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో కాకాణి పోస్టింగ్లు పెట్టారు. దీనిపై మేకల నరేంద్ర చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్పై కాకాణిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుని అక్కడి నుంచి భారీ భద్రత నడుమ మంగళగిరికి తరలించారు. ఈరోజు గుంటూరులోని కోర్టులో మాజీ మంత్రిని హాజరుపర్చనున్నారు. మరోవైపు కాకాణికి వరుసగా కేసులన్నీ చుట్టుకుంటున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వం హయాంలో సర్వేపల్లిలో పెద్ద ఎత్తున గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు ఆ కేసు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు వంద కోట్లకు పైగా గ్రావెల్ అక్రమాలు ఒకే ప్రాంతంలో జరిగాయి. ఆ అక్రమాల్లోనే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. దీనిపై కూడా కేసు నమోదు అయ్యింది. అలాగే కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఓ టోల్గేట్ను ఏర్పాటు చేసి భారీ వాహనాల నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేశారు. దానికి సంబంధించి కూడా ముత్తుకూరు పోలీస్స్టేషన్లో మాజీ మంత్రితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు కూడా తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Latest News