![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:30 PM
జర్నలిస్ట్ కృష్ణంరాజు డిబేట్లో పాల్గొన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవే, వాటిని వైయస్ఆర్సీపీకి, టివి యాజమాన్యానికి ఎలా ఆపాదిస్తారని వైయస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కృష్ణంరాజు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన తరువాత కూడా కూటమి సర్కరా్ ఒక పథకం ప్రకారం వాటిని రాజకీయం చేసేందుకు, వైయస్ కుటుంబం మీద వ్యక్తిత్వ హననంకు వాడుకుంటోందని మండిపడ్డారు. మహిళలను కించపరిచే ఎటువంటి వ్యాఖ్యలనైనా సరే టివి, వైయస్ఆర్సీపీ సమర్థించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. కూటమి ఏడాది పాలనపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం వెన్నుపోటు దినం విజయవంతం ద్వారా బహిర్గతం అవ్వడంతో, దానిని నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రపూరితంగా టీడీపీ దానికి వంతపాడే ఎల్లోమీడియా, సోషల్ మీడియా ద్వారా పనిగట్టుకుని దుష్ప్రచారంకు దిగారని ధ్వజమెత్తారు.
Latest News