![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:26 PM
గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైయస్ జగన్ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్ జగన్ చేరుకుంటారన్నారు. వైయస్ జగన్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని వివరించారు.అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని బూచేపల్లి సిబ్బందికి సూచించారు. వారి వెంట వైయస్ఆర్సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వైఎం ప్రసాద్రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.నరసింహారావు తదితరులు ఉన్నారు.
Latest News