![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 06:24 PM
ఆంధ్రప్రదేశ్లో మరో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉపాధి చూపిస్తానంటూ ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. భీమిలి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం. విజయనగరానికి చెందిన ఓ బాలిక భీమిలిలో అమ్మమ్మ వద్ద ఉంటోంది. అక్కడే పదో తరగతి వరకూ చదువుకుంది. ఈ సమయంలోనే హేమలత అనే మహిళతో బాలికకు పరిచయమైంది. మాటలతో మొదలైన పరిచయం.. బాగా నమ్మకంగా మారింది. ఈ క్రమంలోనే హేమలత ఆ బాలికను తిమ్మాపురంలో ఉండే నూకరాజు అనే వ్యక్తికి పరిచయం చేసింది. నూకరాజు రాడ్ బెండింగ్ పనులు చేస్తుంటాడు. అయితే ఉపాధి చూపిస్తానని బాలికను నమ్మించిన నూకరాజు.. దారుణానికి ఒడిగట్టాడు.
బాలికను ఇంటికి తీసుకువెళ్లిన నూకరాజు.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏప్రిల్ నెల చివర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక తల్లిదండ్రులు శనివారం భీమిలి పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేయటంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను వైద్య పరీక్షల కోసం కేజీహెచ్కు తరలించారు. నూకరాజుతో పాటుగా అతనికి సహకరించిన హేమలత అనే మహిళను అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మరోవైపు శ్రీసత్యసాయి జిల్లాలోనూ ఇటీవల ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ దళిత బాలికపై కొంతమంది అఘాయిత్యానికి పాల్పడగా.. బాలిక గర్భం దాల్చటంతో కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించాడు. అమాయకంగా నమ్మిన బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. ఆ స్నేహితుడు కూడా ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
అంతటితో ఊరుకోకుండా మరో ఫ్రెండ్ సాయంతో ఆ దారుణాన్ని వీడియో తీయించాడు. సెల్ఫోన్ ఈ వీడియో తీసి వాట్సాప్లో షేర్ చేయటంతో.. ఈ వీడియోతో భయపెట్టి ఆ బాలికపై 13 మంది అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి రాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Latest News