![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 11:35 AM
యోగాతో పాటు ధ్యానం కూడా ఎంతో అవసరమని దీనివలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఎంపీడీవో జివి రవికుమార్ తెలిపారు. సోమవారం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా పోలాకి మండల కేంద్రంలో యోగ అవగాహన ర్యాలీ నిర్వహించామని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ యోగ జీవనంలో ఒక భాగం కావాలని అప్పుడే మంచి ఫలితాలను సాధించుకో గలుగుతామని ఆయన వివరించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Latest News