అమరావతి ప్రాంత మహిళలను అవమానిస్తారా?
 

by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:21 PM

అమరావతి ప్రాంత మహిళలను అవమానిస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఒక టెలివిజన్ ఛానెల్‌లో విశ్లేషకుడి ముసుగులో ఒక వ్యక్తి చేసిన తీవ్ర వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమరావతి ప్రాంత మహిళలను, ఈ నేల చారిత్రక, ఆధ్యాత్మిక, బౌద్ధ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు."ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దు. ఆ ఛానెల్ కూడా... ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, మాకు మహిళలంటే ఎంతో గౌరవం అంటూ తప్పించుకోలేదు. వాటిని ప్రసారం చేయడమే కాదు... చర్చ సందర్భంలో కనీసం ఖండించి, తప్పుబట్టలేదు. అంటే ఆ చర్చ వెనుక... నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఈ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని, విలసిల్లిన బౌద్ధాన్నీ అవమానించి అవహేళన చేయాలనే కుటిల యత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలి" అని స్పష్టం చేశారు.

Latest News
Spreading Pak propaganda: BJP slams Cong for criticising Centre over Prez Trump-Munir meeting Thu, Jun 19, 2025, 04:47 PM
Brisbane Heat retain Jemimah Rodrigues in WBBL international players draft Thu, Jun 19, 2025, 04:41 PM
Young woman jumps to death from Hyderabad's cable bridge Thu, Jun 19, 2025, 04:31 PM
Plane crash victim Payal Khateek's final rites performed in Rajasthan village Thu, Jun 19, 2025, 04:25 PM
Pakistan's global image improving after Operation Sindoor: Udit Raj Thu, Jun 19, 2025, 04:23 PM