![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:20 PM
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. డుంబ్రిగూడ మండలం గుంటసీమ పంచాయతీ కేంద్రంలోని ఓ చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు పదో తరగతి విద్యార్థులు నీట మునిగి మరణించారు. మృతులను కె. సుశాంత్, జి. భాను తేజం, సాయి కిరణ్గా గుర్తించారు.పోలీసుల కథనం ప్రకారం, ఈ ముగ్గురు స్నేహితులు సెలవులు కావడంతో సరదాగా చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే, లోతు అంచనా వేయలేక నీట మునిగి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ రెండు ఘటనలతో తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వేసవి సెలవులు, వర్షాకాలం ఆరంభంలో నీటి వనరుల వద్దకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
Latest News