![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 05:46 PM
రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు కొందరు పోలీస్ అధికారులు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని, వారితో ఒక ఆర్గనైజ్డ్ క్రై మ్ గ్యాంగ్ తయారయ్యిందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. గుంటూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష్మీనారాయణను వేధించిన డీఎస్పీపై ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించి, తగిన చర్యలు తీసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జ్తో జ్యుడీషియల్ ఎంక్వయిరీ జరిపించాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యహింస ఘటనలపై రాష్ట్రపతికి, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Latest News