![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 05:12 PM
అధికారం కోసం హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం వైయస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏడాది పాలనలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఎల్లో మీడియా ద్వారా ఒక భజన కధనాన్ని రాయించుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబును జాకీలు పెట్టి పైకి లేపే ప్రయత్నంలో భాగంగా ఏడాదిలో చంద్రబాబు ప్రజలకు ఎంతో చేశారని, మిగిలింది ఎప్పుడంటూ రాసిన కథనం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. గత చరిత్ర చూసినా ఎన్నడూ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. అయన మాట్లాడుతూ... చంద్రబాబు సీఎంగా ఏడాది పాలనలో బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలను ఇచ్చారు, ఇంకా కొంత పెండింగ్లో ఉంది, వాటిని కూడా ఇచ్చేయండీ అంటూ ఎల్లో పత్రిక చంద్రబాబు పాలనను కీర్తిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు 1999, 2014, 2024లో మేనిఫేస్టోలను పార్టీ పరంగా విడుదల చేశారు. ఈ మూడు సందర్భాల్లోనూ ఆయన అధికారంలోకి వచ్చారు. కానీ ఎప్పుడూ తాను మేనిఫేస్టోలో ప్రకటించిన హామీలను పూర్తిగా అమలు చేసిన దాఖలాలే లేవు. ప్రతిసారీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతిసారీ రాష్ట్రం తిరోగమనంలోనే ఉందని వాపోయారు.
Latest News