![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 05:05 PM
రాష్ట్రంలో బ్రాహ్మణులపై యథేచ్ఛగా దౌర్జన్యాలు సాగుతున్నాయని, వారిని కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందని, అందుకు విజయవాడలోని శాతవాహన కాలేజీ కూల్చివేత తార్కాణంగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారన్న ఆయన, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కూల్చిన కాలేజీ శిధిలాల కింద విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నా, కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన ఆక్షేపించారు. ఇటీవలే శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ కిడ్నాప్నకు గురయ్యారని, కాలేజీకి చెందిన 5 ఎకరాల భూమిపై కొందరి కన్ను పడిందని, ఆ భూమి కబ్జా కోసమే ఈ దౌర్జన్యం, కూల్చివేత సాగిందని చెప్పారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా? అని ప్రశ్నించారు.
Latest News