మధ్యప్రదేశ్ లో బయటపడ్డ భారీ కుంభకోణం
 

by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:50 AM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేసేలాంటి భారీ కుంభకోణం ఒకటి వెలుగు చూసింది. ఏకంగా 50,000 మందికి పైగా బోగ‌స్‌ ప్రభుత్వ ఉద్యోగుల పేరిట సుమారు రూ. 230 కోట్ల ప్రజాధనాన్ని కొందరు అక్రమార్కులు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది నిజమైన ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలకు పైగా జీతాలు అందకపోవడంతో ఈ భారీ మోసం బయటపడింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు.అస‌లైన‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెల‌లుగా జీతాలు చెల్లించకపోవడంతో ఈ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ జీతాల చెల్లింపు వ్యవస్థపై అనుమానాలు తలెత్తాయి. అధికారులు లోతుగా పరిశీలించగా, అనేక అనుమానాస్పద ఉద్యోగుల కోడ్‌లు, జీతాల పంపిణీలో తీవ్రమైన అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. ప్ర‌భుత్వ పేరోల్‌లో నకిలీ ఉద్యోగుల పేర్లను చేర్చి, ప్రజా సేవకుల కోసం కేటాయించిన భారీ మొత్తంలో నిధులను కొన్ని వ్యవస్థీకృత ముఠాలు కాజేసినట్లు ప్రాథమికంగా తేలింది.

Latest News
Playing domestic cricket serves as good challenge when not playing international games: SKY Mon, Dec 08, 2025, 02:47 PM
Two killed, 20 injured in highway accident in Afghanistan Mon, Dec 08, 2025, 02:43 PM
IndiGo cancels 112 flights at Hyderabad Airport, passengers continue to suffer Mon, Dec 08, 2025, 02:39 PM
Govt's multi-pronged strategy boosting consumption, growth: FM Sitharaman Mon, Dec 08, 2025, 02:37 PM
Hardik's experience is invaluable, gives good balance to the side: Suryakumar Mon, Dec 08, 2025, 02:34 PM