|
|
by Suryaa Desk | Sat, Jun 07, 2025, 11:11 AM
ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాల పండుగ బక్రీద్ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఆయన అన్నారు.దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్ పండగ జరుపుకుంటారని వైయస్ జగన్ అన్నారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని చెప్పారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని గుర్తు చేశారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని వైయస్ జగన్ తన సందేశంలో అభిలషించారు.
Latest News