![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:05 PM
ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ రయన్ఎయిర్ తన సిబ్బందికి షాకిచ్చింది. ఇటీవల పెంచిన జీతాలను తిరిగి చెల్లించాలని ఆదేశించింది. జీతాల పెంపు ద్వారా ఒక్కో ఉద్యోగి సుమారు రూ. 2.8 లక్షల వరకు అందుకున్నారని, ఆ మొత్తాన్ని వెంటనే కంపెనీ ఖాతాలో జమ చేయాలని పేర్కొంది. లేదంటే నెలనెలా జీతంలో కోత పెడతామని స్పష్టం చేసింది. జీతాల పెంపునకు సంబంధించి ఉద్యోగ సంఘంతో కుదుర్చుకున్న ఒప్పందం చెల్లదని కోర్టు తీర్పు ఇవ్వడంతో కంపెనీ ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
Latest News