![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:07 PM
గన్నవరం మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నేత వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.వంశీ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆయన భార్య పంకజశ్రీ వెంటనే కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆసుపత్రికి వచ్చి వంశీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వంశీ కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Latest News