![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:18 PM
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పట్ల కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆరోపించారు. వంశీకి బెయిల్ రాగానే కేసుల మీద కేసులు పెడుతున్నారని విమర్శించారు. మానవత్వం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. అక్రమ కేసులు పెట్టీ ఈ ప్రభుత్వం వేధించాలని చూస్తోందన్నారు. న్యాయ పోరాటం చేస్తామని, అక్రమ కేసుల అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నిలబడలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్న వంశీపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని అన్నారు. వంశీని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఆరోపించారు.
Latest News