![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 04:17 PM
శ్రీవారి సేవ స్లాట్లలో మార్పులు తీసుకొచ్చి, భక్తులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు టీటీడీ కృషి చేస్తుందని టీటీడీ EO శ్యామల రావు అన్నారు. అయన మాట్లాడుతూ.... గ్రూప్ లీడర్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, 50% పాత భక్తులు, 50% కొత్త భక్తులకు శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించబడుతోంది. ఈ విధానం ద్వారా అందరికీ సమాన అవకాశం లభిస్తుందని, ఇది భక్తుల సంతృప్తిని మరింత పెంచుతుందని చెప్పారు . తిరుమలను ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు టీటీడీ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో 10 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నిర్మాణాలపై ఆంక్షలు విధించడం ద్వారా, అస్తవ్యస్తమైన అభివృద్ధిని నియంత్రించడం జరుగుతోంది. ఈ చర్యలు తిరుమల సౌందర్యాన్ని, పవిత్రతను కాపాడేందుకు దోహదపడతాయి అని వివరించారు.
Latest News