![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:49 PM
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఈ ఎలుగుబంటి ఏకంగా ప్రైవేటు స్కూల్లోకే వెళ్లి కలియతిరిగింది.మడకశిర పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. రాత్రి సమయంలో స్కూల్లో మొత్తం తిరిగింది. స్కూల్ ఆవరణలో తిరుగుతున్న ఎలుగుబంటిని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే అరుపులు, కేకలు వేశారు. ప్రజల అరుపులు విన్న ఎలుగుబంటి కొండ ప్రాంతంలోకి పారిపోయింది. ఎలుగుబంటి సంచారంపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి బారి నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Latest News