![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:49 PM
ఈరోజు (శుక్రవారం) ఉదయం న్యూ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సమావేశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. న్యూ రెన్యువబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషీతో సమావేశం సంతృప్తినిచ్చిందన్నారు. పీఎం సూర్యగర్ ముక్తి బిజిలి యోజన రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ అలోకేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.20 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని కోరామన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు పదివేల రూపాయల వరకూ సబ్సీడీతో సోలార్ రూఫ్ టాప్లో సోలార్ ప్యానల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించామని చెప్పారు. కేంద్ర సహకారంతో విద్యుత్తు ధరలు తగ్గించడంతో పాటు క్లీన్ ఎనర్జీకి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.
Latest News