![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:51 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మె చేపట్టారు. కార్మికులకు మద్ధతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్లో విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతోపాటు వారి డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని షర్మిల డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగానే తాను నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న షర్మిల.. స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న కార్మికులకు ఆమె మద్దతు తెలిపారు.
Latest News