![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:25 PM
విజయనగరం ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఉగ్ర లింకులతో సంబంధాలున్న సిరాజ్, సమీర్లను వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. సిరాజ్, సమీర్లు విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిన్న (గురువారం) రాత్రి 10:30 నిమిషాలకు విజయనగరం పోలీసులకు సిరాజ్, సమీర్ల పోలీస్ కస్టడీ అనుమతుల పేపర్స్ అందడంతో ఈరోజు (శుక్రవారం) ఉదయాన్నే సెంట్రల్ జైలుకు విజయనగరం పోలీసులు చేరుకున్నారు. ఈ కేసులో ఏ1 సిరాజ్, ఏ2 సమీర్లను రహస్య ప్రదేశంలో విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. రెండు వాహనాల్లో విశాఖ సెంట్రల్ జైలుకు వచ్చారు విజయనగరం పోలీసులు. సిరాజ్, సమీర్లను సెంట్రల్ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్న వెంటనే ఎన్ఐఏ విచారం చేపట్టనుంది. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుంది. ఉగ్ర కుట్రలకు సంబంధించి పలు అంశాలపై ఎన్ఐఏ బృందాలు సమగ్రంగా పరిశీలన చేస్తున్నాయి.
Latest News