![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 01:28 PM
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపించారు. యాక్సిస్ ఎనర్జీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్ను సవాల్ చేశారు.
వైసీపీ పాలనలో యాక్సిస్ నుంచి యూనిట్ విద్యుత్ను రూ.5.15కు కొనుగోలు చేశారని, అయితే కూటమి ప్రభుత్వం ఈ ధరను రూ.4.60కు తగ్గించిందని మంత్రి వెల్లడించారు. జగన్ హయాంలో యూనిట్కు రూ.9.30 వరకు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసినట్లు ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై జగన్తో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఒప్పందంలో ఎవరెంత పెట్టారో తేల్చుకుందామని గొట్టిపాటి సవాల్ విసిరారు.