![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 08:02 PM
పాకిస్థాన్కు గూఢచర్యం చేసిందన్న ఆరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆమె విలాసవంతమైన జీవనశైలి, విదేశీ పర్యటనలకు నిధులు ఎలా సమకూరాయన్న కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. తాజాగా, ఆమెకు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.జ్యోతి మల్హోత్రా చేసిన కొన్ని వీడియోలకు యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న 'వెగో' అనే ట్రావెల్ కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 'వెగో' సంస్థకు అంతర్జాతీయ విమాన రవాణా సంఘం గుర్తింపు ఉంది. సింగపూర్, దుబాయ్ వంటి నగరాల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. అంతేకాకుండా, పాకిస్థాన్లోనూ చట్టబద్ధంగా కార్యకలాపాలు నిర్వహించడానికి 'వెగో'కు లైసెన్స్ ఉందని సమాచారం.అయితే, ఈ సంస్థ నేరుగా పాకిస్థాన్కు నిధులు సమకూర్చినట్లు ఆధారాలు లేకపోయినా, గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా ప్రయాణాలకు స్పాన్సర్గా నిలవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Latest News