అమరావతిని అభివృద్ధి పేరుతో ఐదేళ్లు కొనసాగిస్తూనే ఉంటారు
 

by Suryaa Desk | Thu, May 22, 2025, 08:00 PM

అమరావతిలో నిరంతరం కాంట్రాక్టులు కొనసాగాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారని జగన్ ఆరోపించారు. "నిరంతరం కాంట్రాక్టులు ఉండాలి, నిరంతరం పనులు జరుగుతూ ఉండాలి, నిరంతరం వాళ్లు బిల్లులు ఇస్తూ ఉండాలి, నిరంతరం వాళ్లు డబ్బులు ఈయనకి ఇస్తూ ఉండాలి. ఇది నిరంతరం జరుగుతూ ఉండాలన్నదే వారి ఆలోచన" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన నూతన సచివాలయం కూడా అన్ని హెచ్‌ఓడీ కార్యాలయాలతో కలిపి 8 లక్షల 58 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఉందని జగన్ పోల్చి చెప్పారు. అంతకంటే చాలా రెట్లు అధిక విస్తీర్ణంలో ఏపీలో సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన అన్నారు. కేవలం అమరావతిని ఇలాగే కొనసాగించాలని, తద్వారా నిరంతరాయంగా కాంట్రాక్టులు పొందుతూ, ఆర్థిక లబ్ధి పొందాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని వైఎస్ జగన్ విమర్శించారు.

Latest News
Illegal gratification: ED files chargesheet against Himachal ex-Deputy Drug Controller Sat, Dec 20, 2025, 03:37 PM
Eggs safe for consumption; cancer risk claims misleading, not scientific, says FSSAI Sat, Dec 20, 2025, 03:20 PM
CM Vijayan, Satheesan and others mourn Sreenivasan, hail his enduring legacy in Malayalam cinema Sat, Dec 20, 2025, 03:15 PM
BJP accuses Rahul Gandhi of meeting 'anti-India' forces in Germany, 'defaming' nation Sat, Dec 20, 2025, 03:14 PM
Ashes: England slide to 207/6 at stumps on Day 4 in massive chase of 435 in Adelaide Test Sat, Dec 20, 2025, 03:02 PM