![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 01:56 PM
ఈ నెల 23న నెల్లూరు జిల్లాలోని కనపర్తిపాడులో మహానాడు నిర్వహించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమ సంబంధిత ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బుధవారం పరిశీలించారు. అనంతరం మహానాడులో చేయాల్సిన తీర్మానాలపై చర్చించారు. ఈ సమయంలో మంత్రి వెంట నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వక్ఫ్ రెడ్డి ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.
Latest News