![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 01:58 PM
హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణములోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి అమర్నాథ్ స్వాగతం పలికారు. హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Latest News