|
|
by Suryaa Desk | Thu, Mar 14, 2024, 12:38 PM
తనకల్లు మండలం కొర్తికోట గ్రామ సచివాలయం పరిధిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి బుధవారం ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతులకు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు, యంత్ర పరికరాలు అనువైన ధరలకు లభించేవిధంగా రైతుభరోసా కేంద్రాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.
Latest News