|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 03:23 PM
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వరుసగా ఆ పార్టీకి కీలక నేతలతో పాటు బూత్ స్థాయి కార్యకర్తలు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి.
మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో వారు టీడీపీ కుండువా కప్పుకున్నారు. తిరుగుడు తలుపు వ్యవహారాలతో రాజకీయాలు కలుషితం అయ్యాయని, సర్పంచ్, ఎంపీటీసీలు సర్వనాశనం అయ్యారని అశోక్ గజపతిరాజు అన్నారు.