జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:36 PM

తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా జువ్వలదిన్నె హార్బర్‌ను ప్రారంభించనున్నారు. ఈ హార్బరు ద్వారా 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.1250 మోటరైజ్డ్, మెకనైజ్డ్‌ బోట్లు నిలిపేలా ఈ హార్బర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఈ హార్బర్‌ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపద అదనంగా అందుబాటులోకి వస్తుంది. హార్బర్‌లోనే కోల్డ్‌ చైన్, ఐస్‌ప్లాంటు, చిల్‌ రూమ్‌ వంటి మౌలిక వసతులు, బోట్‌ రిపేర్‌ వర్క్‌షాపులు, గేర్‌షెడ్‌లు, నెట్‌ మెండింగ్‌ షెడ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ ఫిషింగ్‌ హార్బర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూ.16,000 కోట్లతో చేపట్టిన నాలుగు పోర్టుల నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఈ పోర్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున ఉపాధి, తక్కువ రవాణా వ్యయంతో ఎగుమతులు చేసుకునే అవకాశం వస్తుంది. 

Latest News
Mexican president warns against foreign meddling Wed, May 06, 2026, 11:34 AM
Suchi Semicon fully committed to India Semiconductor Mission: Founder on Cabinet's nod Wed, May 06, 2026, 11:28 AM
MP: Two charred to death as car erupts in flames after crashing into electric pole Wed, May 06, 2026, 11:24 AM
Indian companies plan to invest over $20.5 billion in US: Sergio Gor Wed, May 06, 2026, 11:19 AM
New Zealand unemployment down to 5.3 pc in Q1 Wed, May 06, 2026, 11:09 AM