|
|
by Suryaa Desk | Thu, Feb 08, 2024, 07:22 PM
శ్రీ సత్య సాయి జిల్లా గుడిబండ మండలం కెరి కేరా గ్రామంలో స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాల వద్ద ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ పద్మావతి మాట్లాడుతూ పుస్తకాలు మోసే వయసులో పుస్తెల భారం వద్దుఅన్నారు. చిన్నవయసులో ఆడపిల్లలకు పెళ్లి చేయకూడదు అన్నారు. చదువుకుంటే మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టాలని కోరారు.
Latest News