|
|
by Suryaa Desk | Wed, Feb 07, 2024, 01:27 PM
సీఎం జగన్కు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. ఏపీకి పదేళ్లలో జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలులో జాప్యాన్ని లేఖలో పేర్కొన్నారు.
అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేశారు.