|
|
by Suryaa Desk | Mon, Feb 05, 2024, 04:05 PM
కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్య అనుచరుడు పప్పుల మసేను టీడీపీలో చేరడం ఖాయమైంది.
చింతలపూడి 'రా.. కదలిరా' సభలో చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు 150 కార్లతో రాజమండ్రి మీదుగా చింతలపూడికి పప్పుల మసేను బయల్దేరారు.