కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'తునివు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ హీస్ట్ డ్రామా జనవరి 10, 2023న విడుదల కానుంది అని సమాచారం. ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, స్టార్ హీరో అజిత్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతునట్లు సమాచారం. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa