☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీపీ నీ పరామర్శించిన బుట్టా దంపతులు
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎంపీపీ నీ పరామర్శించిన బుట్టా దంపతులు

16 Sep 2026 Reporter

మాజీ ఎంపీపీని పరామర్శించిన బుట్టా  దంపతులు

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి

గోనెగండ్ల మండల మాజీ ఎంపీపీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  నసూరుద్దీన్‌ ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు  బుట్టా రేణుక   పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నసీరుద్దీన్  ఆరోగ్య పరిస్థితిని ఆమె అడిగి తెలుసుకున్నారు. బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ తో పాటు కలిసి గోనెగండ్ల మండల కేంద్రంలోని నసూరుద్దీన్‌  నివాసానికి చేరుకున్న బుట్టా రేణుక  ఆయనను  పలకరించి ఆరోగ్య పరిస్థితిపై అరా తీశారు.  నసీరుద్దీన్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా బుట్టా రేణుక  మాట్లాడుతూ.. నసూరుద్దీన్‌  సేవలు పార్టీకి, గోనెగండ్ల మండలానికి అవసరం ఆయననేపథ్యంలో అయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. అనంతరం నసూరుద్దీన్‌  సతీమణిని కూడా బుట్టా రేణుక  పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, మనోధైర్యాన్ని నింపారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home