BREAKING
ధ్రువీకృత ప్రపంచంలోనూ ఏకాభిప్రాయ సాధనకు భారత్‌ వేదిక: జైశంకర్ బ్రిక్స్ విజయం భారత్ ప్రపంచ నాయకత్వానికి నిదర్శనం: సీఎం యోగి బ్రిక్స్ సదస్సు విజయవంతం 'సముద్ర లక్ష్మణ' విన్యాసాలు పూర్తి చేసిన ఐఎన్ఎస్ మైసూర్ ఆసియా కప్ విజేతలకు రాష్ట్రపతి అభినందనలు కొబ్బరి పీచుతో గ్రామీణ మహిళల సాధికారత ఢిల్లీలో రూ. 13,800 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం నేపాల్‌కు విద్యుత్ ఎగుమతికి భారత ప్రభుత్వం ఆమోదం సెప్టెంబర్ 17న ‘సెమికాన్ ఇండియా 2026’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ హ్యూస్టన్‌లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ పర్యటన హిందీ, భారతీయ భాషలే జాతీయ ఐక్యతకు సాధనాలు: అమిత్ షా ప్రధాని మోదీ పుట్టినరోజున 'ఆశీర్వాద దీపం' వెలిగించాలి భారతదేశంలో తీవ్రమవుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడి బీహార్‌లోని 17 జిల్లాలకు వాతావరణ హెచ్చరిక భారత ఆర్థిక రంగానికి చోదక శక్తిగా డేటా సెంటర్లు

నేపాల్‌కు విద్యుత్ ఎగుమతికి భారత ప్రభుత్వం ఆమోదం

Select Suryaa Now
నేపాల్‌కు విద్యుత్ ఎగుమతికి భారత ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ: ఇటీవల సంభవించిన తీవ్ర వరదల కారణంగా జలవిద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిని విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న నేపాల్‌కు అండగా నిలిచేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశ అదనపు విద్యుత్ అవసరాలను తీర్చడానికి రోజుకు 18 గంటల పాటు విద్యుత్‌ను ఎగుమతి చేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయం ప్రకారం సెప్టెంబర్ 13 నుండి డిసెంబర్ 31, 2026 వరకు ప్రతిరోజూ 00:00 గంటల నుండి 18:00 గంటల మధ్య నేపాల్ విద్యుత్ అథారిటీకి భారత్ సరఫరా చేయనుంది. ముజఫర్‌పూర్–ధల్కేబార్ 400 kV డబుల్-సర్క్యూట్ ట్రాన్స్‌మిషన్ లైన్ ద్వారా 600 మెగావాట్ల వరకు, అలాగే తానక్‌పూర్–మహేంద్రనగర్ 132 kV సింగిల్-సర్క్యూట్ లైన్ ద్వారా 54 మెగావాట్ల వరకు విద్యుత్‌ను అందించనున్నారు.

వరదల వల్ల స్వదేశీ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పడిపోయిన నేపాల్‌కు ఈ నిర్ణయం ఎంతో ఊరట నివ్వనుంది. జనవరి 2027 నుండి ఎగుమతి చేయాల్సిన విద్యుత్ పరిమాణాన్ని డిసెంబర్ 2026లో పునఃసమీక్షిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ చర్య భారత్, నేపాల్‌ మధ్య దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని మరియు సరిహద్దు విద్యుత్ వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.