హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విలీన ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో కలపనున్నారు.తెలంగాణ మున్సిపాలిటీ చట్టాల సవరణకు మంత్రివర్గం ఆమోదం ఈ విలీనం కోసం జీహెచ్ఎంసీ, తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్బాబు మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ పరిధి ప్రస్తుత 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2,735 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. జనాభా కూడా సుమారు 2 కోట్లకు చేరనుంది. నగరంలో సమగ్రాభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.మరోవైపు ఈ విలీన ప్రతిపాదనపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వడానికి జీహెచ్ఎంసీ కౌన్సిల్ కూడా అంగీకరించింది. అయితే, కౌన్సిల్లో ఎంఐఎం పార్టీ ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుండగా, ఆ తర్వాతే విలీన ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది.విలీనంతో హెచ్ఎండీఏ ఆదాయానికి భారీగా నష్టం ఈ విస్తరణ వల్ల శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడతాయి. ఉద్యోగుల వేతనాలు జీహెచ్ఎంసీ ప్రమాణాలకు అనుగుణంగా మారతాయి. పన్నుల విధానంలో కూడా ఏకరూపత వస్తుంది. అయితే, ఈ నిర్ణయంతో హెచ్ఎండీఏ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ వెంబడి ఉన్న గ్రోత్ కారిడార్ నుంచి వచ్చే ప్రధాన ఆదాయం ఇకపై జీహెచ్ఎంసీకి వెళ్లనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa