ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి రాజకీయాలలో విలువలు కనుమరుగయ్యాయి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 06:16 PM

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు కలుషితమైపోయాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో తనపై ఎలాంటి మరక పడకుండా ఉన్నానంటే, దానికి స్ఫూర్తి దివంగత నేత ఎన్టీ రామారావేనని స్పష్టం చేశారు. ఈరోజు ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.తన రాజకీయ జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం చాలా ఉందని తుమ్మల అన్నారు. 1983 నుంచి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని తెలిపారు. "ఎన్టీఆర్ శిష్యుడు ఎవరు అంటే తుమ్మల" అనేలా పేరు తెచ్చుకున్నానని భావోద్వేగానికి గురయ్యారు. రాముడి పాదాల చెంత ఎన్టీఆరే స్వయంగా తనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఆయన నుంచే నిజాయతీ, నిబద్ధతతో రాజకీయాలు చేయడం నేర్చుకున్నానని వెల్లడించారు. రాష్ట్ర, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa