ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ అప్ డేట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 03:17 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని ప్రాథమికంగా తెలిపింది.ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం కారణంగా అండమాన్ నికోబార్ దీవులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. నవంబర్ 24, 25 తేదీల్లో అక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, నవంబర్ 23 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. పోర్ట్ బ్లెయిర్ పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. అలల ఉద్ధృతి కారణంగా పర్యాటకులు, బోట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa