ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు: ఉచిత లడ్డూలు, కమాండ్ కంట్రోల్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 01:40 PM

శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్‌ రమేష్ నాయుడు నేతృత్వంలోని సమావేశంలో ప్రత్యేక దర్శన టికెట్‌ కొనుగోలు చేసే భక్తులకు ఉచిత లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించారు. డిసెంబరు 1 నుంచి రూ. 500 స్పర్శ దర్శనానికి 2 లడ్డూలు, రూ. 300 సర్వదర్శనానికి ఒక లడ్డు ఇవ్వనున్నారు. ఫిర్యాదులు, సూచనల కోసం బాక్సులు, హెల్ప్‌లైన్, డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. చెంచు గిరిజనులకు నెలలో ఒకరోజు సర్వ దర్శనం కల్పించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa