ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దానం నాగేందర్‌కు ఢిల్లీ ‘రక్షణ’.. రాజ్యసభ లేదా మంత్రి పదవి.. డెడ్‌లైన్‌కు ముందే ‘డీల్’?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 12:20 PM

తెలంగాణలో బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మందిపై అనర్హత విచారణ పూర్తయింది. మిగిలిన ఇద్దరు – మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీనియర్ నేత దానం నాగేందర్‌లకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 23లోపు వివరణ సమర్పించాలని ఆదేశించిన స్పీకర్, ఆ తర్వాతే వారిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో దానం నాగేందర్ మాత్రమే తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నారు.
నోటీసు అందిన మరుసటి రోజే శుక్రవారం ఉదయం దానం నాగేందర్ ఢిల్లీకి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు, అధిష్టానంతో అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సీటు కోల్పోకుండా ఉండేందుకు ఆయన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కాపాడిన అనుభవం కాంగ్రెస్‌కు ఉన్న నేపథ్యంలో దానం ఆశలు పెంచుకున్నారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఏప్రిల్‌లో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని దానం నాగేందర్‌కు కేటాయించే అవకాశం ఉంది. లేదా ఎమ్మెల్సీగా చేసి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వడం దాదాపు ఖరారైందని అంతర్గత చర్చలు సాగుతున్నాయి. ఇలాంటి ఆఫర్ వస్తే దానం సీటు కోల్పోయినా రాజకీయంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతారు.
కడియం శ్రీహరి విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఆయన కుమార్తె కవిత కాంగ్రెస్ టికెట్‌పై గెలిచినా, కడియం ఇప్పటికే పార్టీలో అంతగా యాక్టివ్ కాకపోవడంతో అధిష్టానం ప్రత్యేక ఆఫర్ ఇవ్వకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంమ్మీద దానం నాగేందర్‌కు మాత్రమే ఢిల్లీ నుంచి బంపర్ ఆఫర్ రాబోతోందన్న చర్చ హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa